నవంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటిఆర్ అన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఈ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి కేటిఆర్ వివరణ ఇచ్చారు. “నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది” అని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు.
ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది. 2/2
— KTR (@KTRTRS) September 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu