తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు (మార్చి 14, ఆదివారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఆరు జిల్లాల పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ కేంద్రాల్లో జంబో బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,31,268 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు:
- టీఆర్ఎస్ – పల్లా రాజేశ్వర్రెడ్డి
- కాంగ్రెస్ – రాములు నాయక్
- బీజేపీ – ప్రేమేందర్ రెడ్డి
- తెలంగాణ జన సమితి – కోదండరాం
- ఇండిపెండెంట్ – తీన్మార్ మల్లన్న
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు:
- టీఆర్ఎస్ – సురభి వాణిదేవి
- కాంగ్రెస్ – చిన్నారెడ్డి
- బీజేపీ – రామచంద్రరావు
- టీడీపీ – ఎల్.రమణ
- ఇండిపెండెంట్ – ప్రొఫెసర్ నాగేశ్వర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ