దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు www.cowin.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఇకపై ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోకపోయినా నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటును కలిపిస్తునట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 60 ఏళ్లు పైబడినవారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని, అలాగే 20 రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వారు వ్యాధిని నిర్ధారణకు సంబంధించి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ధ్రువీకరణ పత్రం చూపించి కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పారు.
అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వేసే ఆసుపత్రుల పూర్తి జాబితా www.cowin.gov.in పోర్టల్ లో అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో మార్చి 12, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1227 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ