ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 14669 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,69,544 కు చేరింది. కొత్తగా అత్యధికంగా గుంటూరులో 2072, చిత్తూరులో 1975, నెల్లూరులో 1926, తూర్పుగోదావరిలో 1415, అనంతపూర్ లో 1291, శ్రీకాకుళంలో 1255, విశాఖపట్నంలో 1083 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 6433 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 71 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7871 కి పెరిగింది. గత 24 గంటల్లో 74,748 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,62,17,831 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 28, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు :10,69,544
- కొత్తగా నమోదైన కేసులు : 14,669
- కొత్తగా నమోదైన మరణాలు : 71
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 9,54,062
- యాక్టీవ్ కేసులు : 1,07,611
- మొత్తం మరణాల సంఖ్య : 7871
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ