ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 12994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం వంటి 4 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 24, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,93,821 కు చేరుకుంది. ఇక కరోనా వలన మరో 96 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 10222 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 18373 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 13,79,837 కు చేరింది. అలాగే ప్రస్తుతం 2,03,762 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,86,76,222 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(12994):
- నెల్లూరు – 503
- తూర్పుగోదావరి – 2652
- గుంటూరు – 670
- విశాఖపట్నం – 1690
- శ్రీకాకుళం – 864
- చిత్తూరు – 1620
- కర్నూల్ – 856
- విజయనగరం – 535
- ప్రకాశం – 703
- కడప – 874
- అనంతపూర్ – 1047
- కృష్ణా – 274
- పశ్చిమగోదావరి – 706