తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు పనిచేస్తుండగా, పనివేళల్లో మళ్ళీ మార్పులు చేశారు. జూన్ 1 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నట్టు తెలిపారు. దీంతో రోజూ 6 గంటల పాటు బ్యాంకు సేవలను అందించనున్నారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 9 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నుంచి బ్యాంకులు/ ఏటీఎంలు, బీమా సేవలు మరియు సంబంధిత కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. లాక్డౌన్ లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరేందుకు మరో గంట పాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల పనివేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ