ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించి, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలకు ములాయం సింగ్ యాదవ్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. కాగా ములాయం ఆరోగ్య పరిస్థితిపై మేదాంతా ఆసుపత్రి నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు గత అక్టోబర్ లో ములాయం సింగ్ యాదవ్ కరోనా వైరస్ బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ