తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో పర్యటించి గ్రామస్థులు అందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలోని సమస్యలపై చర్చించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గ్రామంలో అభివృద్ధి పనులు పరిశీలన, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు మార్లు వాసాలమర్రికి వస్తానని పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వాసాలమర్రిలోని దళితవాడలో పర్యటించడంతో పాటుగా రైతువేదికలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ