ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే పోసాని ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, మరికొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని ఏఐజీ వైద్యులు తెలిపారు. కాగా గతంలో కూడా పోసాని కృష్ణమురళికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. ఇక మరోవైపు తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. వీటిలో హైదరాబాద్లోనే 18 కేసులు ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE