కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఈ రోజు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపి, ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
మరోవైపు దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జమ్మికుంట పట్టణ శివారులో గల శాలపల్లిలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భారీ బహిరంగ సభ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ