హుజురాబాద్ లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఆటోనగర్ భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 347 కుటుంబాలకు ఈ ఆటోనగర్ లో ప్లాట్లు కేటాయించి వారికి శాశ్వత వర్క్ షెడ్లు కట్టిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు అద్దెలు చెల్లించనవసరం లేకుండా, వారికీ ఇది శాశ్వత ఆస్తిగా ఉంటుందన్నారు. టీఎస్ఐఐసీ ద్వారా కేసీఆర్ ఆటోనగర్ కోసం 3 కోట్లు మంజూరు చేసామని, ఇక్కడ రోడ్లు, మంచినీరు, మరుగుదొడ్ల వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
హుజురాబాద్ లోని మెకానిక్ లందరూ ఇక్కడే ఉండేలా చూసుకుంటే, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆటోనగర్ కోసం హామీ ఇచ్చినప్పుడు ఇంత వేగంగా అవుతుందా అనే అనుమానం కొందరిలో ఉండేదన్నారు. అయితే హామీ ఇచ్చిన విధంగా చెప్పింది చెప్పినట్లు చేస్తాం తప్ప, మాట తప్పడం మాకు తెల్వదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోందని, గతంలో ఆడపిల్లల పిల్లల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఎవరూ సాయం చేయలేదన్నారు. ఆడ పిల్లలకు సాయం అందిస్తోన్న దేశంలోని మొదటి సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ