ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పందన కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయాన్ని బలంగా క్షేత్రస్థాయి కి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఏ విభాగంలో కూడ అవినీతి జరగకూడదని పదే పదే చెబుతున్నానని, ఈ విషయంలో ఏదైనా మార్పు వచ్చింది అని తాను భావించవచ్చా అని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో తహసీల్దార్,పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఏంటని, మారిందని తాను అనుకోవచ్చా అని జగన్ అడిగారు.
అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, లంచాలు అనే మాట ఈ ప్రభుత్వ హయాంలో వినపించకూడదని ముఖ్యమంత్రి మరోసారి అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఒక ముఖ్యమంత్రి గా తన స్థాయిలో తాను ప్రయత్నిస్తున్నానని, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు కూడ అవినీతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పూర్తిగా నిర్మూలించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు సంతోషంగా పని ముగించుకొని వెళ్లాలని, వారికి ఆ భరోసా ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఇకపై స్పందన కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ కూడ సమీక్షిస్తారని, కొన్ని జిల్లాల ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలై 1 నుండి 12 వరకు వచ్చిన పిర్యాదులు, పరిష్కార మార్గాలుపై కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు.
[subscribe]
[youtube_video videoid=aM3HUD_0bJU]