శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరపరిధిలో 24 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 16, శనివారం ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 17, ఆదివారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో విజయ యాత్ర జరగనుంది. శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర నగరంలో పలు ప్రాంతాల గుండా సాగనుండడంతో పోలీసులు ఇప్పటికే అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటూ, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ