కామన్వెల్త్ గేమ్స్-2022, ఆర్చరీ వరల్డ్ కప్ మరియు వరల్డ్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన శ్రీకాంత్ కిదాంబి, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఈవెంట్లో శెట్టి చిరాగ్తో కలిసి స్వర్ణ పతకం సాధించినందుకు సాత్విక్ సాయిరాజ్లను గవర్నర్ అభినందించారు.
అలాగే ఆర్చరీ వరల్డ్ కప్ 2022లో వ్యక్తిగత ఈవెంట్లో రజత పతకం, 2022 ఆర్చరీ వరల్డ్ కప్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం, 2022 ఆర్చరీ వరల్డ్ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించినందుకు జ్యోతి సురేఖ వెన్నంను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా నలుగురు క్రీడాకారులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేశారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించినందుకు నలుగురు క్రీడాకారులకు గవర్నర్ అభినందనలు తెలిపి, వారి అత్యుత్తమ విజయాలను చూసి ఆంధ్రప్రదేశ్ మరియు దేశం గర్విస్తున్నదని, భవిష్యత్తులో వారు దేశానికి మరెన్నో అవార్డులు అందజేయాలని ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY