తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో లోతైన విచారణ జరపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇక ఈ కేసులో బీఎల్ సంతోష్తో పాటు కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామి, కేరళలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లాపల్లి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ న్యాయవాది అయిన బూసారపు శ్రీనివాస్కు సిట్ నోటీసులు ఇచ్చింది. వారిని ఈరోజు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరింది.
ఈ నేపథ్యంలో వారు సిట్ ఎదుట హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో వీరి పాత్రపై పలు ఆధారాలు లభించాయని, అందుకే వారిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు పొలిసు వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ కేసు దర్యాప్తులో ఈ నలుగురి వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. అలాగే ఈనెల 29వ తేదీ లోపుగా కేసు దర్యాప్తులో పురోగతిని హైకోర్టులో సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ కీలకం కానుంది. దీంతో ఈ నలుగురు ఉపయోగించే సెల్ ఫోన్స్, ల్యాప్టాప్లు మరియు టాబ్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తప్పనిసరిగా తీసుకురావాలని నోటీసుల్లో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను అరెస్టు చేయకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తెలంగాణ హైకోర్టు శనివారం నిషేధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE