తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదటిదశలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించి, ఇప్పటికే ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియలో కీలకమైన రెండోదశకు తేదీలు ఖరారు అయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 2,37,862 మంది వ్యక్తిగత అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు/ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట (1 ప్రయోగాత్మక కొత్త ప్రదేశం) వంటి 11 వేదికలు/గ్రౌండ్లలో పీఎంటీ/పీఈటీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఈవెంట్స్ ప్రక్రియను జనవరి 2023 మొదటి వారంలోగా అనగా 23-25 పనిదినాల్లో పూర్తిచేసే అవకాశం ఉందని తెలిపారు. పీఎంటీ మరియు పీఈటీ ఒక్కసారి మాత్రమే (2 పోస్టులకు అప్లై చేసినా కూడా) నిర్వహించబడతాయని మరియు ప్రతి అభ్యర్థి దరఖాస్తు చేసిన మరియు పీఎంటీ/పీఈటీకి అర్హత పొందిన అన్ని పోస్ట్లకు ఒకే రీడింగ్లు/స్కోర్లు చెల్లుబాటు అవుతాయని చెప్పారు.
నవంబర్ 29 నుంచి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్:
పీఎంటీ/పీఈటీకి అర్హత సాధించి పార్ట్ 2 దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులందరూ తమ వ్యక్తిగత అడ్మిట్ కార్డ్లు/ఇంటిమేషన్ లెటర్లను నవంబర్ 29వ తేదీ ఉదయం 8 గంటల నుండి డిసెంబర్ 3వ తేదీ 20 అర్ధరాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో www.tslprb.in లో వారి సంబంధిత యూజర్ ఖాతాలలోకి లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిట్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు [email protected]కి ఈ-మెయిల్ పంపవచ్చని లేదా 9393711110 లేదా 9391005006లో నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE