దేశంలో కరోనా: కొత్తగా 268 మందికి పాజిటివ్ గా నిర్ధారణ, కేసులు ఎక్కడ ఎక్కువంటే?

India Reports 268 Corona Positive Cases, 182 Recoveries in Last 24 Hours

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 2,36,919 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 268 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.11 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,77,915 కు చేరుకుంది. కరోనా వలన మరో 2 మరణాలు (మహారాష్ట్రలో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,698కి పెరిగింది. అలాగే 182 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,43,665కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

కాగా ప్రస్తుతం దేశంలో 3,522 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు.

గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (డిసెంబర్ 28 (8am)–డిసెంబర్ 29 (8am)):

  1. కేరళ – 99
  2. కర్ణాటక – 39
  3. మహారాష్ట్ర – 36
  4. ఢిల్లీ – 13.
  5. తెలంగాణ – 12.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here