కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

CM Jagan Announces Rs.2 Lakh Ex-gratia For The Families of Stampede Victims at Kandukur,AP Police Registered Case,Stampede Incident,TDP Chief Chandrababu Road Show,Kandukur Chandrababu Stampede Incident,Mango News,Mango News Telugu,Stampede at TDP Meeting,TDP Meeting in Kandukur,TDP Chief Chandrababu,Chandrababu's Public Meeting,Chandrababu Meeting in Kandukur,Chandrababu Meeting,Chandrababu Kcr,Chandrababu Meeting Live,Chandrababu Kuppam Tour,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే సంఘటన జరిగిన తీరుపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన ఇక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, అలాగే గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు పరిహారం సత్వరమే అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని నెల్లూరు కలెక్టర్‌కు ఆయన సూచించారు.

బాధిత కుటుంబాలకు టీడీపీ సాయం పెంపు

కాగా బుధవారం రాత్రి కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఇద్దరు మహిళలు సహా మొత్తం 8మంది గాయపడగా, మరో ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఇక తన సభలో జరిగిన ఘటనపై చలించిపోయిన చంద్రబాబు బాధిత కుటుంబాలకు పార్టీ తరపున రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అయితే పార్టీలోని సీనియర్ నేతలతో మాట్లాడిన అనంతరం ఆ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు నేడు వెల్లడించారు. అలాగే పార్టీలోని కొందరు నేతలు వ్యక్తిగతంగా సాయమందించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని కూడా కలిపి 8మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.23 లక్షల చొప్పున అందజేయడానికి నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + fourteen =