దేశవ్యాప్తంగా శనివారం అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రధాన ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అన్ని శివాలయాల్లో అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పవిత్రమైన రోజున ప్రజలు శివుని ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న
పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE