బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మహిళా కమిషన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.
ఈ మేరకు మహిళా కమిషన్ బండి సంజయ్ ని మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని, ఈ నెల 18వ తేదీన కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని లేఖలో అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించి, మార్చి 18వ తేదీన ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. కాగా మార్చి 18న హాజరుకాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించినట్టు మహిళా కమిషన్ ప్రకటనలో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE