మంగళవారం మచిలీపట్నంలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మచిలీపట్నం సభలో పవన్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని, ఆయన ఒకవైపు తనకు కులాల భావన లేదని చెప్తూనే, మరోవైపు కాపు కులస్తులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. కాపులందరికీ తానొక్కడే ప్రతినిధిని అన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని, అయితే వాస్తవానికి కాపులు సీఎం జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీకి, జనసేనకు ఉన్న ముసుగు తొలగిందని, వచ్చే ఎన్నికలకు చంద్రబాబు, పవన్ కలిసి రావాలని నాని అన్నారు. ఇక తన స్వార్ధ రాజకీయాల కోసం సొంత అన్న చిరంజీవిని కూడా పవన్ విమర్శిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE