జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అధికారులు స్వాగతం పలికారు. మార్చి 20, 21 తేదీల్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా యొక్క భారతదేశ అధికారిక పర్యటనలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారని కేంద్ర విదేశీ వ్యవహారాలు ప్రకటించింది. అలాగే ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇరువురూ ప్రధానులు జీ7 మరియు జీ20 యొక్క సంబంధిత ప్రెసిడెన్సీల కోసం వారి ప్రాధాన్యతలను కూడా చర్చిస్తారని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE