దేశంలో మళ్ళీ కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 918 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,96,338కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 236, గుజరాత్ లో 133, కేరళలో 149, కర్ణాటకలో 78, తమిళనాడులో 73 వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరో 4 మరణాలు (రాజస్థాన్ లో 2, కర్ణాటకలో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ ఆరు వేలు (6350 (0.01%) దాటింది. అలాగే మరో 479 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,59,182 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం 8 గంటల వరకు 220.65 కోట్లకుపైగా (220,65,06,044) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. మొత్తం 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులలో 95.20 కోట్ల సెకండ్ డోస్ మరియు 22.86 కోట్ల ప్రికాషన్ డోస్ ఇవ్వబడ్డాయన్నారు. గత 24 గంటల్లో 1,246 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE