తెలంగాణ రాష్ట్రంలో 35 గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2023-24 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్ఆర్జేసీ సెట్-2023” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు 2023 ఏప్రిల్ నెలలో పదో తరగతికి హాజరవుతున్న విద్యార్థులు ఆన్లైన్లో (https://tsrjdc.cgg.gov.in/) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ముందుగా మార్చి 31గా నిర్ణయించారు. అయితే తల్లితండ్రుల నుంచి విజ్ఞప్తులు, విద్యార్థుల సౌకర్యార్ధం తాజాగా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఏప్రిల్ 15కు పొడిగించినట్టుగా తెలిపారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 2022-23 పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 కలిపి మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా, 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ-ఇంగ్లీషు మీడియం) ప్రవేశాల కోసం టీఎస్ఆర్జేసీ సెట్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ టీఎస్ఆర్జేసీ సెట్-2023 పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ప్రవేశపరీక్ష మల్టీపుల్ చాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉండనుండగా, దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE