ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 17, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ను పూర్తిస్థాయిలో అమలుచేయడంతో పాటుగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 19లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ జనరల్ మరియు జిల్లా ఆస్పత్రుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్యులను నియమించనున్నారు. ఒక ఏడాది ఒప్పందం ప్రాతిపదికన ప్రభుత్వం ఈ నియామకాలను చేపడుతుంది. 1184 పోస్టులలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, మత్తు వైద్యులు, జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు:
వెబ్ సైట్: http://dme.ap.nic.in/
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 592
- స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ మరియు స్పెషలిస్ట్ ఇన్ పల్మనరీ మెడిసిన్ : 400
- స్పెషలిస్ట్స్ ఇన్ అనస్తీషియా : 192
- దరఖాస్తుకు ఆఖరి తేదీ : ఏప్రిల్ 19, 2020 5గంటల వరకు
- వేతనం : స్పెషలిస్ట్ లకు : రూ. 1,10,000 /-, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లకు : రూ. 53,945 /-
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu