ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటిలోకి దిగుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ జనసేన సింగిల్గా బరిలోకి దిగాయి. అటు జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి దిగింది. ఈ ఎన్నికల్లో 2014 కూటమి రిపీట్ అయ్యింది. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, దాని పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిని ఓ సారి విశ్లేషిద్దాం.
–> నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
–> ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులపై భూకబ్జా ఆరోపణల కారణంగా ఆదాలకు పరిస్థితి కాస్త అనుకూలంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
–> ఆత్మకూరులో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపునకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.
–> ఉదయగిరిలో కూడా మేకపాటి కుటుంబానికి చెందిన వ్యక్తి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతం ఎవరు గెలుస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు విశ్లేషకులు.
–> కోవూరులో వైసీపీ నుంచి ఇటీవల ఫిరాయించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీకి చెందిన వేమిరెడ్డి పరాశాంతిరెడ్డి మధ్య ఆసక్తికర పోరు ఉంది. పరశాంతి రెడ్డి ధనబల రాజకీయాలను తిప్పికొడితే తప్ప ఫలితం ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.
–> కావలిలో వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రతాప్ కుమార్ రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి.
–> గూడూరు (ఎస్సీ)లో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్కుమార్ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ విజయం సాధించారన్న ప్రచారం రచ్చబండలపై సాగుతోంది.
–> వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి లక్ష్మీసాయిప్రియ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ పరిస్థితి వైసీపీకి కాస్త అనుకూలంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
–> సూళ్లూరుపేట వైసీపీకి అడ్వాంటేజ్ ఉందన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య, టీడీపీ తరఫున డాక్టర్ విజయశ్రీ పోటీ చేస్తున్నారు.
–> మొత్తానికి నెల్లూరు రూరల్, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉందని అర్థమవుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE