తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. టీటీడీ భూముల విక్రయానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ భూముల వేలంపై ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని, ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించకముందే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఈసారి జరిగే బోర్డు సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
శ్రీవారి ఆస్తుల విషయంలో అసత్య ప్రచారాలు చేయొద్దు, నమ్మొద్దని చెప్పారు. రాజకీయ వ్యతిరేకతతోనే ఈ అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వం హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుల ద్వారా తామే అడ్డుకున్నామని చెప్పారు. టీటీడీ కి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి బాధ్యతగా, జాగ్రత్తగా ఖర్చు చేస్తామని, టీటీడీ ఆస్తులను కాపాడాలనేదే మా ఉద్దేశమని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu