ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే వుంది. మే 8, శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 7,320 సాంపిల్స్ ని పరీక్షించగా 54 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కొత్తగా అనంతపూర్ జిల్లాలో 16, విశాఖపట్నం జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, కర్నూల్ లో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3, గుంటూరు, విజయనగరం జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 54 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1887 కు పెరిగింది. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 41 మంది మృతి చెందగా, మరో 842 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 1004 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 7, గురువారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1122 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 12 కేసులు నమోదవగా, వలస వచ్చిన వారికీ ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, 693 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 400 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో 24 గంటల్లో 7,320 సాంపిల్స్ ని పరీక్షించగా 54 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసు లకు గాను 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1004. #APFightsCorona #COVID19 pic.twitter.com/FKgoPxmDUs— ArogyaAndhra (@ArogyaAndhra) May 8, 2020
Media bulletin
Date: May 7, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/iENkr6bdB2
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 7, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu