ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మిగతా రాష్ట్రాలకూ కూడా ప్రత్యేక బృందాలను కేంద్రప్రభుత్వం పంపిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై తాజా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఐఎంసీటి బృందం రాష్ట్రానికి చేరుకుంది.
ముందుగా విజయవాడ లోని కోవిద్ కంట్రోల్ రూమ్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, స్థానిక పరిస్థితులు, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాలలో కేంద్ర బృందం పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu