ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 17, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 41మంది డీఎస్పీల బదిలీల్లో 37మంది వెయింటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్లు ఇవ్వగా, మరో నలుగురిని మాత్రం పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. పోస్టింగ్లు పొందినవారిలో ఆరుగురుని సీఐడీ విభాగానికి, ఇద్దరిని ఏపీఎస్పీ బెటాలియన్కు, ఒకరిని ఏసీబీకి కేటాయించారు. ఇక మిగిలిన వారిని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోస్టులను కేటాయించారు.
[subscribe]