మే 25, సోమవారం నుంచి దేశంలో పలు రాష్ట్రాల మధ్య విమాన రాకపోకలు మొదలయిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో దేశీయ విమాన సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలల పాటు నిలిచివేయబడిన దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని గన్నవరం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కరోనా నివారణ నిబంధనలను అనుసరించి ఎయిర్పోర్ట్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాతనే ప్రయాణికులను అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రాంగణంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
ఇక గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు మరియు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ల మధ్య విమాన సర్వీసులు ఈ రోజు నుంచి నడవనున్నాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం, విశాఖ ఎయిర్ పోర్టులకు విమానాలు చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోకి వచ్చే విమాన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కేంద్రం సూచనల అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలని రూపొందించి విడుదల చేసింది. చెన్నై, ముంబయి, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపేలా ఏర్పాట్లు చేయగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించాక హోం క్వారంటైన్ ఉండాలని ఆదేశాలు ఇస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu