ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఈ ఆరు స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా చల్లా భగీరథరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరీమున్నీసా మార్చి 4, గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఈ స్థానాలకు ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. అలాగే వారి ఎన్నికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ