ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నం 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారమే జీవో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు విన్నవించింది. ప్రమాదాల నివారణ కోసమే ఈ జీవో తీసుకొచ్చామని, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఇందులో స్పష్టం ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నం.1 పై జోక్యం చేసుకోలేమని, 23వ తేదీన కేసు విచారణలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. అలాగే హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE