ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డిసెంబర్ 31, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,77,145 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14,495 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 91 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,61,496 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,154 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(166):
- విశాఖపట్నం – 31
- చిత్తూరు – 28
- కృష్ణా – 21
- నెల్లూరు – 13
- పశ్చిమగోదావరి – 12
- అనంతపూర్ – 12
- గుంటూరు – 10
- తూర్పుగోదావరి – 10
- కర్నూల్ – 9
- విజయనగరం – 8
- ప్రకాశం – 6
- శ్రీకాకుళం – 3
- కడప – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ