ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1859 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 12, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,88,910 కు, మరణాల సంఖ్య 13595 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1575 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,56,627 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,688 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1859):
- తూర్పుగోదావరి – 402
- చిత్తూరు – 233
- నెల్లూరు – 225
- పశ్చిమగోదావరి – 195
- గుంటూరు – 182
- కడప – 148
- కృష్ణా – 144
- విశాఖపట్నం – 123
- ప్రకాశం – 96
- అనంతపూర్ – 40
- శ్రీకాకుళం – 28
- విజయనగరం – 24
- కర్నూల్ – 19
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ