విజయవాడ బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు, రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేత

Vijayawada Govt Hospital Molestation Incident Chandrababu Announces Rs 5 Lakh Ex-gratia To Victim's Family, Chandrababu Announces Rs 5 Lakh Ex-gratia To Vijayawada Govt Hospital Molestation Victim's Family, 5 Lakh Ex-gratia, Chandrababu Announces Rs 5 Lakh Ex-gratia, Vijayawada Govt Hospital Molestation Incident, Govt Hospital Molestation Incident, 5 Lakh Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, Govt Hospital Molestation Incident In Vijayawada, Govt Hospital Molestation Incident, Chandrababu Announces 5 Lakh Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, 5 Lakh Compensation, Molestation Incident, Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, Vijayawada Govt Hospital Molestation Incident News, Vijayawada Govt Hospital Molestation Incident Latest News, Vijayawada Govt Hospital Molestation Incident Latest Updates, Vijayawada Govt Hospital Molestation Incident Live Updates, Mango News, Mango News Telugu,

విజయవాడలో వేధింపులకు గురైన బాధితురాలికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆస్పత్రిని సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ముగ్గురికీ ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. అలాగే బాధితురాలికి కోటి పరిహారం చెల్లించాలని, దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ తరపున బాధితురాలికి రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిని సందర్శించి బాధితురాలుని పరామర్శించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

అయితే తమ కుమార్తె మిస్సింగ్ ఫిర్యాదుపై పోలీసులు సత్వరం స్పందించకపోవడమే ఘోరమైన నేరానికి దారితీసిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె నుంచి ఫోన్‌ వచ్చిన మొబైల్‌ నంబర్‌ను అందించినా పోలీసులు వేగంగా స్పందించలేదని బాధితురాలి తల్లిదండ్రులు మండిపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించకుండా కాలయాపన చేశారని, సాయంత్రం రావాలని చెప్పారని వాపోయారు. కాగా పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన, వామపక్ష పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకు దిగారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించేందుకు జీజీహెచ్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలుపై ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి సీరియస్‌గా వ్యవహరించడంతో నగరంలోని నున్న పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేశారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. యువతి ఆరోగ్యం మెరుగయ్యే వరకూ ప్రభుత్వమే ట్రీట్‌మెంట్‌ అందించాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ముగ్గురు నిందితులను సర్వీసు నుంచి తొలగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =