ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 739 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 6, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,22,064 కు, మరణాల సంఖ్య 13,925 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,333 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,93,589 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,550 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(739):
- చిత్తూరు – 166
- నెల్లూరు – 114
- కడప – 98
- ప్రకాశం – 94
- గుంటూరు – 66
- కృష్ణా – 64
- తూర్పుగోదావరి – 58
- విశాఖపట్నం – 54
- శ్రీకాకుళం – 11
- పశ్చిమగోదావరి – 9
- అనంతపూర్ – 3
- విజయనగరం – 2
- కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ