జూలై 15 న ఏపీ కేబినెట్ భేటీ

Andhra Pradesh Cabinet Meet, Andhra Pradesh cabinet meeting, Andhra Pradesh Cabinet to Meet on July 15th, AP Cabinet Meeting, AP Cabinet Meeting 2020, AP Cabinet Meeting Latest Updates, AP Cabinet Meeting Updates, YS Jagan Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై జూలై 13 సాయంత్రం 5 గంటల లోపు అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖల అధికారులను సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశించారు.

ఈ‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి‌ నియంత్రణ చర్యలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత కేబినెట్ సమావేశం జూన్ 11 న జరగగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత పథకం, టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు, ఫీజు రియింబర్స్‌మెంట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం, ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =