టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను శుక్రవారం నాడు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. దూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలోగల నరేంద్ర నివాసం వద్దే శుక్రవారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు, ఆతర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు దూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. “తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందస్తు నోటీసులు లేకుండా, ఉన్నపళంగా వందల మంది పోలీసులు ఇంటికి వెళ్ళి అరాచకం సృష్టిస్తారా? సంగం డైరీని ఎవరికోసం నాశనం చేయాలని చూస్తున్నారు? నరేంద్రను వెంటనే విడుదల చేయాలి” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ