ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత నియామకం.
- సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు
- కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా కార్తికేయ మిశ్రా
- కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా జి.రేఖారాణి
- పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్
- విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్గా రంజిత్ బాషా
- ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈవోగా ఎన్.వీ రమణారెడ్డి
- ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్గా ఉన్న హిమాన్షు కౌశిక్ కు ఏపీ భవన్ ప్రత్యేక అధికారి(టూరిజం) అండ్ ఈ.ఓ ప్రత్యేక కమిషనర్ గా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అదనపు బాధ్యతలు అప్పగింత
- ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా ఆర్.పవన్ మూర్తి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF