వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కమిటీల స్థానంలో జిల్లాల వారీగా పార్టీ కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 11 మంది జిల్లా పార్టీ కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
జిల్లా పార్టీ కోఆర్డినేటర్ల వివరాలు ఇవే:
- గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ – వాడుక రాజగోపాల్
- ఉమ్మడి ఖమ్మం జిల్లా – గడిపల్లి కవిత
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా – నీలం రమేష్
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా – బెజ్జంకి అనిల్కుమార్
- వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా – నాడెం శాంతికుమార్
- వికారాబాద్ జిల్లా – తమ్మాలి బాలరాజ్
- భూపాలపల్లి జిల్లా – అప్పం కిషన్
- నల్గొండ జిల్లా – ఇంజం నర్సిరెడ్డి
- యాదాద్రి భువనగిరి జిల్లా – మహమ్మద్ అత్తార్ ఖాన్
- ములుగు జిల్లా – రామసహాయం శ్రీనివాస్రెడ్డి
- రంగారెడ్డి జిల్లా – ఎడమ మోహన్రెడ్డి
- నారాయణపేట జిల్లా – మడివాలా కృష్ణ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF