ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా

Andhra Pradesh Group-1 Exams Postponed, Andhra Pradesh Latest News, AP Breaking News, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, Group-1 Mains Exams Postponed, Group-1 Mains Exams Postponed In AP, Mango News Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 20, సోమవారం నాడు ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అలాగే జనవరి 27, సోమవారంలోగా పరీక్షల యొక్క కొత్త షెడ్యూల్‌ని ప్రకటిస్తామని తెలిపారు. అయితే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రెండో సారి వాయిదా పడటం విశేషం. ముందుగా గత ఏడాది డిసెంబరు 12 నుంచి 23వ తేదీల మధ్య ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. అనంతరం ఫిబ్రవరి 4 నుంచి 16 వతేది వరకు పరీక్షలు జరిగేలా వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి అభ్యర్థుల నుంచి విజ్ఞప్తుల వచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =