పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నిక చెల్లదు, స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission of India Orders YSRCP to Clarify Reports that CM Jagan Being Made Party Permanent President, Election Commission of India Orders YSRCP, ECI Orders YSRCP, CM Jagan Being Made Party Permanent President, CM Jagan Party Permanent President, YSRCP Permanent President, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, YSR Congress Party, YSRCP Party President, ECI Latest News And Updates, YS Jagan News And Live Updates

గత జూలైలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ) ఫ్లీనరీలో భాగంగా పార్టీ జీవితకాలపు/శాశ్వత జాతీయ అధ్యక్షుడిగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నిక వార్తలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తాజాగా స్పందించింది. ఈ ఎన్నికను సీఈసీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని, రాజకీయ పార్టీలోని ఏదైనా సంస్థాగత పదవి శాశ్వత స్వభావం కలిగి ఉండే ఏదైనా ప్రయత్నం లేదా సూచన కూడా సహజంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. ఎన్నికల కాలవ్యవధిని తిరస్కరించే ఏ చర్య అయినా, ఎన్నికల సంఘం యొక్క ప్రస్తుత సూచనలను పూర్తిగా ఉల్లంఘిస్తుందని సీఈసీ పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇలాంటి చర్య ఇతర రాజకీయ నిర్మాణాలలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉందని మరియు క్రమంగా ఇతరులు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సీఈసీ తెలిపింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష ఎన్నిక విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీఈసీ, ఈ అంశంపై పార్టీలో అంతర్గత విచారణను త్వరగా ముగించి, పేర్కొన్న మీడియా/వార్తాపత్రిక నివేదికలకు విరుద్ధంగా స్పష్టమైన మరియు సంబంధిత బహిరంగ ప్రకటన చేయాలని, తద్వారా ఎటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా ఉంటుందని వైఎస్సార్సీపీని ఆదేశించింది.

ముందుగా ప్లీనరీలో భాగంగా ఆర్టికల్ 9 వైఎస్సార్సీపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని, ఈ సవరణకు ఆమోదం తెలుపుతున్నట్టు పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఫ్లీనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరపున 22 సెట్ల నామినేషన్స్ దాఖలు అయ్యాయని, అలాగే ఇతరుల తరఫునుంచి ఎలాంటి నామినేషన్స్ దాఖలు కానీ కారణంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటించారు. తాజాగా ఈ ఎన్నికపైనే సీఈసీ స్పందిస్తూ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడం చెల్లదు అని ప్రకటించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =