రాష్ట్రంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల్లో తరగతుల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులుపై జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఈనెల 4 (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం.
ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ.
ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు.
మే 6 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. pic.twitter.com/EbkgIa8FgL
— Audimulapu Suresh (@AudimulapSuresh) April 1, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ