రాష్ట్రంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉత్తమ గ్రామా/వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతల ఆధారంగా 3 కేటగిరీల్లో ఉత్తమ వాలంటీర్ల ఎంపిక ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వాలంటీర్లు అందించిన సేవలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.
1వ కేటగిరి కింద ఎంపికైన గ్రామా/వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్, మరియు రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నారు. 2వ కేటగిరి కింద వాలంటీర్లకు సేవారత్న పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు. అలాగే 3వ కేటగిరి కింద సేవా వజ్రంపేరిట పురస్కారం, స్పెషల్ బ్యాడ్జ్ తో పాటుగా మెడల్ మరియు రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 13న గ్రామా/వార్డు వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ