ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీలు త్వరలో మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు కొనసాగుతుండగా, తాజాగా రెగ్యులర్ క్లాసులపై ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని అన్ని కాలేజీల యాజమాన్యాలకి మరియు ప్రిన్సిపాల్స్ కు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఆగస్టు 16 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ