ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మొదట నిర్ణయించిన మేరకు ఈనెల మార్చి 3వ తేదీన (గురువారం) జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7వ తేదీకి (సోమవారం) వాయిదా పడింది. ఈ మధ్య మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి దశదిన కర్మ జరుగనుండనందున కేబినెట్ భేటీ వాయిదా వేయటానికి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే, మార్చి 7వ తేదీన ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం యధాప్రకారం జరుగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున ఆనవాయితీ ప్రకారం ఉదయం పూట గవర్నర్ ప్రసంగం నిర్వహిస్తారు. ప్రసంగం అనంతరం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్ భేటీ పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు జరపటానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో చర్చించిన మీదట నిర్ణయం తీసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ