మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్టును, వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవాల అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇటీవలే రూ.7289 కోట్లతో ‘‘మన ఊరు–మన బడి’’ ప్రణాళిక కోసం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. మొదటి దశలో 9,123 ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్ల బడ్జెట్ తో పనులు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ