ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్

4 Years Completion of Praja Sankalpa Padayatra, AP CM YS Jagan, AP News, CM YS Jagan, CM YS Jagan Tweets Over 4 Years Completion of Praja Sankalpa Padayatra, Mango News, Praja Sankalpa Padayatra, YS Jagan Praja Sankalpa Padayatra, YS Jagan Praja Sankalpa Padayatra 4 Years Completion, YS Jagan Praja Sankalpa Padayatra 4 Years Completion News, YS Jagan Tweets Over 4 Years Completion of Praja Sankalpa Padayatra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి నేటితో (నవంబర్ 6, 2021) నాలుగేళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. “ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది.” అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ పాదయాత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, నాయకులు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం, కేక్ కటింగ్, పాదయాత్ర మరియు సర్వమత ప్రార్ధనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + one =