టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో సీఎం మమతా బెనర్జీ సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని మెడికా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆషీమ్ బెనర్జీ తుదిశ్వాస విడిచినట్టు మెడికా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ అలోక్రాయ్ తెలియజేశారు. ఆషీమ్ బెనర్జీ మృతితో సీఎం మమతా బెనర్జీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆషీమ్ బెనర్జీ మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ